సివిల్స్ విజేతలకి సీపీ మహేష్ భగవత్ సన్మానం

సివిల్స్ విజేతలకి సీపీ మహేష్ భగవత్ సన్మానం

సివిల్స్ లో అర్హత పొందిన అభ్యర్థులు దేశానికి, ప్రజలకు అంకిత భావంతో  సేవ చేయాలన్నారు రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్. 2018 సంవత్సరంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ లో ర్యాంకులు సాధించిన ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులకు సోమవారం రాచకొండ కమీషనర్ కార్యాలయంలో ఆయన సన్మానం చేసారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ దేశ ప్రగతిలో ఈ అభ్యర్థులంతా భాగస్వామ్యం కావాలని కోరారు.

ర్యాంకులు సాధించిన అభ్యర్థులు మాట్లాడుతూ తాము ఈ ర్యాంకులు సాదించడానికి తాము అహర్నిశలు శ్రమించామని తెలిపారు. ఈ విజయానికి తమ కుటుంబ సభ్యులతో పాటు తమకు సలహాలు, సూచనలు ఇచ్చిన కమీషనర్ మహేష్ భగవత్ కూడా కారణమని పేర్కొన్నారు. తమకెంతో సహాయ సహకారాలు అందించి, రోల్ మోడల్ గా నిలిచిన మహేష్ భగవత్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అందిన ఈ అవకాశాన్ని ప్రజలకు, దేశానికి  సేవ చేయడానికి ఉపయోగిస్తామని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ మహేష్ భగవత్, తెలంగాణా టూరిజం కమీషనర్ సునీతా మహేష్ భగవత్, మల్కాజిగిరి డిసిపి ఉమా మహేశ్వర శర్మ, తదితరులు పాల్గొన్నారు.