న్యూఢిల్లీ: మనదేశంలోని కంపెనీలు ఈ సంవత్సరం సగటున 10 శాతం జీతాల పెంపుదలని అంచనా వేస్తున్నాయి, ఆటోమొబైల్, తయారీ ఇంజనీరింగ్ రంగాల్లో అత్యధిక పెంపుదల ఉండవచ్చని ఓ సర్వే పేర్కొంది. ఢిల్లీలో మంగళవారం కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్స్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే (టీఆర్ఎస్) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2023లో సగటు జీతం పెంపు 9.5 శాతం ఉంది.
గత మే– ఆగస్టు మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 21 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 1,474 కంపెనీల నుంచి డేటాను సేకరించారు. ఇది వివిధ పరిశ్రమలలోని జీతం పోకడలపై దృష్టి సారించింది. ఉద్యోగి పనితీరు, సంస్థ పనితీరు, సాలరీ రేంజ్లో పొజిషన్...ఇంక్రిమెంట్లను నిర్ణయించే మొదటి మూడు అంశాలు. మనదేశంలో స్వచ్ఛంద రాజీనామాల రేటు 2021లో 12.1 శాతం నుంచి 2022లో 13.5 శాతానికి పెరిగిందని టీఆర్ఎస్ పేర్కొంది.