
హైదరాబాద్, వెలుగు : టెలికం టవర్లు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ బొండాడ ఇంజినీరింగ్ మార్కెట్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ షేర్లు బుధవారం సెషన్లో ఐపీఓ ధర కంటే 90 శాతం ఎక్కువ రేటుకు లిస్టింగ్ అయ్యాయి. ఐపీఓలో కంపెనీ షేరు రూ.75 దగ్గర అందుబాటులోకి రాగా, బీఎస్ఈ ఎస్ఎంఈలో రూ.142.50 దగ్గర ఓపెన్ అయ్యాయి. ఇంట్రాడే గరిష్టమైన రూ.150 దగ్గర సెటిలయ్యాయి. ఐపీఓ ధరతో పోలిస్తే ఇది 99.49 శాతం ఎక్కువ.
బీఎస్ఈ ఎస్ఎంఈ డేటా ప్రకారం, మొత్తం 18.75 లక్షల షేర్లు ట్రేడవ్వగా, వీటి టర్నోవర్ రూ.27.50 కోట్లు. బొండాడ ఇంజినీరింగ్ మార్కెట్ క్యాప్ రూ. 323.21 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఐపీఓ ఈ నెల 18–22 మధ్య ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.42.72 కోట్లను సేకరించారు. ‘బొండాడ ఇంజినీరింగ్పై నమ్మకం ఉంచిన వారందరికీ థాంక్యూ. మా సక్సెస్లో మీ ఇన్వెస్ట్మెంట్లు కీలకంగా ఉంటాయి. ఇన్నోవేషన్పై, ఇన్వెస్టర్ల వాల్యూని పెంచడంపై ఫోకస్ పెడతాం’ అని కంపెనీ చైర్మన్, ఎండీ బొండాడ రాఘవేంద్ర పేర్కొన్నారు.
ప్రాఫిట్ రూ.18 కోట్లు..
బొండాడ ఇంజినీరింగ్కు 2022–23 లో రూ.18.25 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ రూ.10.13 కోట్లుగా ఉంది. రెవెన్యూ రూ. 334.11 కోట్ల నుంచి రూ.370.59 కోట్లకు పెరిగింది. సోలార్ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ పెరగడంతో 2022–23 ఆదాయం పెరిగిందని కంపెనీ ఓ స్టేట్మెంట్లో వెల్లడించింది. తమ కంపెనీలో 550 కి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లకు డిజైన్, ఇంజినీరింగ్, ఓ అండ్ ఎం సర్వీస్లను అందించడంలో ముందున్నామని వెల్లడించింది. ఈ ఏడాది ఎకనామిక్ టైమ్స్ నుంచి టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడర్ అవార్డ్ను, గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరమ్ నుంచి కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ను అందుకున్నామని పేర్కొంది. వివ్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్గా పనిచేసింది.