
పద్మారావునగర్, వెలుగు: చేవేళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డారంటూ అడ్వకేట్ రామారావు ఇమ్మానేని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేశారు. పుప్పాలగూడలోని నిషేధిత భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయాలు చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎంపీతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.