ఎల్లారెడ్డిపేట మండలంలో 13 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ఎల్లారెడ్డిపేట మండలంలో 13 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ఎల్లారెడ్డిపేట, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకొని ఫైన్ వేశారు. తహసీల్దార్ సుజాత వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి శుక్రవారం ఉదయం 10గంటలకు 33 ట్రాక్టర్లకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. కానీ ఉదయం 6 గంటలకే వెళ్లి ఇసుకను సర్దాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారని కలెక్టర్ కార్యాలయానికి రైతులు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఆర్ఐ శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి చూడగా.. ఇసుక లోడ్​చేసి ఉన్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. వాటిని తహసీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించి ఒక్కో ట్రాక్టర్ కు రూ.5 వేలు ఫైన్ వేసినట్లు చెప్పారు. 

లారీ, ట్రాక్టర్​ పట్టివేత 

 కోరుట్ల, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం బండలింగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీ, వెల్లుల్ల గ్రామంలో ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టుకున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.