కరకగూడెంలో కూల్డ్రింక్ అనుకొని గడ్డి మందు తాగిన బాలుడు మృతి

కరకగూడెంలో కూల్డ్రింక్ అనుకొని  గడ్డి మందు తాగిన బాలుడు  మృతి

కరకగూడెం, వెలుగు :  మండలంలోని చొప్పాల గ్రామానికి చెందిన ఓ బాలుడు కూల్​డ్రింక్​ అనుకొని గడ్డిమందు తాగిన విషయం తెలిసిందే. ఆ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల కుమారుడు వరుణ్​ తేజ్(4)  గత ఆదివారం ఇంట్లో ఆడుకుంటూ థమ్స్​అప్​ బాటిల్​లో నిలువ చేసిన గడ్డి మందును కూల్​ డ్రింక్​  అనుకొని తాగడు. 

వెంటనే అస్వస్థతకు గురైతన బాలుడిని గమనించి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్​లో కరకగూడెం, ఖమ్మంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ నీలోఫర్​ హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వరణ్​ తేజ్​ చనిపోయాడు.