మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై నేషనల్ ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు

మంత్రి శ్రీనివాస్ గౌడ్​పై నేషనల్ ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు

మహబూబ్​నగర్ టౌన్, వెలుగు: ఎస్సీ సామాజిక వర్గంవాళ్లు థర్డ్ క్లాస్ వ్యక్తులంటూ బహిరంగ సభలో ఎస్సీలను కించపర్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అట్రాసిటీ కేసు పెట్టాలని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నేతలతో కలిసి సోమవారం ఢిల్లీలో నేషనల్ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరున్​కు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా నేత వేముల అశోక్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలాల శివుడు, ప్రధాన కార్యదర్శి కాంతికుమార్, పాలమూరు జిల్లా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. .