గ్రేటర్ వరంగల్: వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి

గ్రేటర్ వరంగల్: వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి

గ్రేటర్​ వరంగల్/ కాశీబుగ్గ, వెలుగు: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం వరంగల్ ఐఎంఏ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వరంగల్​ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో బయోమెడికల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కీలకమన్నారు. అనంతరం ఆమె వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​ను సందర్శించారు. 

కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం, వ్యాపారస్తులతో మాట్లాడారు. ముందుగా మార్కెట్​ చైర్​పర్సన్​ఎర్ర ప్రియాంకకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మిర్చి యార్డులోని రైతులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. గోదాముల్లో భద్రపర్చిన ఈవీఎంలను తనిఖీ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన్​ మంత్రి రాష్ట్రీయ బాల్​ పురస్కార్​–2026 కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్​ సత్యశారద తెలిపారు. 

నామినేషన్లకు జులై 31 చివరి తేదీ, జిల్లాస్థాయిలో పరిశీలన కోసం సంబంధింత వివరాలను ఈ నెల 30 లోగా కలెక్టర్​ ఆఫీస్​లో సమర్పించాలని సూచించారు.