బస్ డిపో, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి

బస్ డిపో, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి
  •     జగద్గిరిగుట్టలో సీపీఐ నాయకుల ఆందోళన

జీడిమెట్ల, వెలుగు : జగద్గిరిగుట్టలో బస్​డిపో, మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, ఉమామహేష్​ మాట్లాడుతూ.. అన్ని పార్టీల నాయకులు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బస్​డిపో, మెడికల్​ కాలేజీ​ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి గెలిచాక పట్టించుకోవడం లేదన్నారు.

గతంలో కంటే జనాభా ఎక్కువగా పెరిగిందని వెంటనే బస్ డిపో, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహదేవ రెడ్డి, రాజు, ఇమామ్ పాల్గొన్నారు.