మెస్ లు సరిగా లేవని ఓయూలో విద్యార్థుల ఆందోళన

మెస్ లు సరిగా లేవని ఓయూలో విద్యార్థుల ఆందోళన

ఓయూ,వెలుగు: హాస్టళ్లలో మెస్​ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గురువారం ఓయూ క్యాంపస్​లో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై తీవ్ర నిరసన తెలిపారు. కొంత కాలంగా వర్సిటీ హాస్టళ్లలో సమస్యలు ఉన్నాయని, మెస్​ల నిర్వహణ సరిగా లేదని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్​చేశారు.  వర్సిటీలో విద్యార్థులకు మెరుగైన మెస్ సౌకర్యాలు కల్పించడంలో  ఓయూ అధికారులు ఫెయిల్ అయ్యారని ఏబీవీపీ నేత రాజు విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి మెస్​లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.