
జైపూర్, వెలుగు: నీలగిరి ప్లాంటేషన్ల నుంచి పేపర్ తయారీకి అవసరమైన కలప సేకరణలో తప్పనిసరిగా రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్, ఐఎఫ్ఎస్ అఫీసర్ ఎం.జె.అక్బర్ అన్నారు. గురువారం మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం, ముదికుంటలోని నీలగిరి ప్లాంటేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్లో పనిచేస్తున్న కూలీలకు ప్రమాదాలు జరుగకుండా సూపర్వైజింగ్ చేయాలని సంబంధితా ఆఫీసర్లకు సూచించారు.
నీలగిరి చెట్లుకోయడం, లారీల్లో కలప నింపే సమయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కూలీలకు హెల్మెట్, బూట్లు అందజేశారు. డైరెక్టర్ వెంట డివిజనల్ మేనేజర్ శ్రావణి, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేశ్ కుమార్, ఇ.లక్ష్మణ్, వాచర్ శంకర్, సిబ్బంది
పాల్గొన్నారు.