యూడైస్ ఆధారంగా టీచర్ల రేషనలైజేషన్ ..మంచిర్యాల జిల్లాలో 30,406 మంది స్టూడెంట్స్కు 2,474 మంది టీచర్లు 

యూడైస్ ఆధారంగా టీచర్ల రేషనలైజేషన్ ..మంచిర్యాల జిల్లాలో 30,406 మంది స్టూడెంట్స్కు 2,474 మంది టీచర్లు 
  • 367 మంది టీచర్లు అదనంగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు 
  • వచ్చే అకడమిక్ ​ఇయర్​లోగా రేషనలైజేషన్​ పూర్తికి కసరత్తు

మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. 2025–-26 యూడైస్​ఆధారంగా స్టూడెంట్ల​లెక్కలు తీసి వచ్చే అకాడమిక్​ఇయర్​లోగా ఈ ప్రక్రియ ​పూర్తిచేయడానికి విద్యాశాఖ అధికారులు కసర్తతు చేస్తున్నారు. ఏ స్కూల్​లో ఎంత మంది స్టూడెంట్స్​ఉన్నారు, ఎంత మంది టీచర్లు అవసరమనే వివరాలను క్రోడీకరిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 15 ఏండ్ల తర్వాత రేషనలైజేషన్​కు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడం విశేషం. దీంతో వచ్చే విద్యాసంవత్సరం స్కూళ్లలో టీచర్ల కొరత తీరుతుందని భావిస్తున్నారు.

అదనంగా 367 మంది టీచర్లు

మంచిర్యాల జిల్లాలో ప్రైమరీ స్కూళ్లు 488, అప్పర్​ప్రైమరీ స్కూళ్లు 88, హైస్కూళ్లు 101తో కలిపి మొత్తం 684 గవర్నమెంట్​ స్కూళ్లు ఉన్నాయి. 2025–26 యూడైస్​ లెక్కల ప్రకారం వాటిలో 30,406 మంది స్టూడెంట్స్​చదువుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 2,474 మంది టీచర్లు ఆయా స్కూళ్లలో పనిచేస్తున్నారు. రేషనలైజేషన్ ​ప్రక్రియలో భాగంగా విద్యాశాఖ అధికారులు ఆయా స్కూళ్లలో ఉన్న స్టూడెంట్లు, అక్కడ పనిచేస్తున్న టీచర్ల వివరాలు తీశారు. రేషనలైజేషన్​గైడ్​లైన్స్​ ప్రకారం జిల్లాలో 367 టీచర్లు అదనంగా ఉన్నట్టు గుర్తించారు. చెన్నూర్​ మండలంలో 43, నెన్నెలలో 29, జైపూర్​లో 26, మంచిర్యాలలో 26, దండేపల్లిలో 43, కోటపల్లిలో 25, తాండూర్​లో 24, హాజీపూర్​లో 22 మంది టీచర్లు అదనంగా ఉండగా.. మిగతా మండలాల్లో 20 మంది లోపు సర్​ప్లస్ ​
ఉన్నట్టు తేల్చారు. 

పీఎస్, యూపీఎస్​లలో.. 

బీఆర్ఎస్​ ప్రభుత్వం 2021 ఆగస్టు 12న రేషనలైజేషన్​ జీవో ఎంఎస్​ నంబర్​25ను జారీ చేసింది. దాని ప్రకారం స్టూడెంట్ల సంఖ్యను బట్టి టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కౌన్సెలింగ్​ద్వారా టీచర్లను ట్రాన్స్​ఫర్స్​ చేయనున్నారు. పీఎస్, యూపీఎస్​లలో ఒకటి నుంచి 19 మంది స్టూడెంట్స్​కు ఒక టీచర్​, 20–60 మందికి ఇద్దరు, 61–90 వరకు ముగ్గురు, 91–120 వరకు నలుగురు, 121–150 వరకు ఐదుగురు, 151–200 వరకు హెచ్​ఎంతో పాటు ఐదుగురు ఎస్జీటీలు ఉంటారు. 201 నుంచి ప్రతి 40 మంది స్టూడెంట్స్​కు ఒక టీచర్​ను నియమించాలి. యూపీఎస్​లలో 6, 7 క్లాస్​లకు ఇద్దరు లాంగ్వేజ్, మరో ఇద్దరు నాన్​ లాంగ్వేజ్​టీచర్లు ఉండాలి.

హైస్కూళ్లలో ఇలా.. 

220 మంది వరకు హెచ్ఎంతో పాటు 8 మంది టీచర్లు, 221–250 వరకు అదనంగా మ్యాథ్స్​ టీచర్​, 251–290 వరకు అడిషనల్​గా మ్యాథ్స్, ఇంగ్లిష్​, తెలుగు టీచర్లను కేటాయించాలి. 311–340 వరకు ఫిజికల్​ సైన్స్, 371–400 వరకు బయోసైన్స్​ టీచర్లను అదనంగా నియమించాలి. 401–430 మంది విద్యార్థులుంటే అదనంగా మరో మ్యాథ్స్​ టీచర్​ను కేటాయించాలి. ఆ తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్​ చొప్పున సంఖ్య పెరుగుతుంది. 

తీరనున్న టీచర్ల కొరత

ప్రస్తుతం జిల్లాలోని పలు గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడెంట్, టీచర్​ రేషియా ప్రకారం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక స్కూల్​లో 20 మంది స్టూడెంట్స్​కు ముగ్గురు టీచర్లు ఉంటే.. మరో స్కూల్​లో 100 మందికి ఇద్దరే ఉన్నారు. దీంతో వర్క్​అడ్జస్ట్​మెంట్ పేరిట టీచర్లను ఒక స్కూల్​నుంచి మరో స్కూల్​కు పంపి టెంపరరీగా సర్దుబాటు చేస్తున్నారు. రేషనలైజేషన్​ చేపడితే స్టూడెంట్ల సంఖ్యకు సరిపడా టీచర్లను నియమించే అవకాశం ఉంటుంది. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగనుండడంతో టీచర్ల కొరత పరిష్కారవుతుందని పేర్కొంటున్నారు. రేషనలైజేషన్​ కమిటీకి కలెక్టర్​ చైర్మన్​గా, మెంబర్స్​గా అడిషనల్​కలెక్టర్, జడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, మెంబర్​ సెక్రటరీగా డీఈవో వ్యవహరిస్తారు.

టీచర్ల కొరత తీరుతుంది

రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్​స్కూళ్లలో టీచర్ల కొరత నెలకొంది. విద్యార్థులు తక్కువ ఉన్న చోట టీచర్లు ఎక్కువగా.. విద్యార్థులు ఎక్కువగా ఉంటే టీచర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో విద్యాబోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్క్​ అడ్జస్ట్​మెంట్​ పేరిట టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నారు. రేషనలైజేషన్​ ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది. - గంగాధర్, పీఆర్టీయూ టీజీ, జనరల్​ సెక్రటరీ, మంచిర్యాల జిల్లా