పవన్​ ఫ్యాన్స్​ మధ్య గొడవ

పవన్​ ఫ్యాన్స్​ మధ్య గొడవ
  • జై పవన్​ నినాదాలు చేస్తుండగా లొల్లి
  • పేపర్లు చింపే కత్తితో గొంతు కోసిన అభిమాని 
  • నిందితుడిపై కేసు వద్దన్న బాధితుడు 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పవన్​కల్యాణ్ నటించిన బీమ్లానాయక్ ​రిలీజ్​రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త ముదిరి కత్తితో అటాక్ ​చేసేవరకు వెళ్లింది. పాల్వంచలోని వేణుగోపాల్​(వేంకటేశ్వర) థియేటర్​లో శుక్రవారం బీమ్లా నాయక్​ సినిమా రిలీజయ్యింది. మ్యాట్నీ షో టికెట్ల కోసం కౌంటర్​వద్ద పవన్​ ఫ్యాన్స్​పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఇందులో పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన షరీఫ్​..కొత్తగూడెంకు చెందిన మధు వర్గాలున్నాయి. వీళ్లిద్దరికి చాలారోజులుగా పడడం లేదు. ఇందులో కొంతమంది మద్యం మత్తులో ఉండడమే కాకుండా థియేటర్​కి బీర్ ​బాటిల్స్ పట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా రెండు వర్గాలు పోటా పోటీగా జై పవన్​..జై జై పవన్​ అంటూ నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది గొడవకు దారి తీసింది. ఆవేశానికి లోనైన మధు పేపర్లు చింపడానికి తీసుకువచ్చిన కత్తి తీసి షరీఫ్​ గొంతు కోశాడు. రక్తం కారుతుండడంతో అతడిని మిగిలిన ఫ్యాన్స్​ గవర్నమెంట్ ​హాస్పిటల్​కు తరలించారు. అయితే థియేటర్ ​మేనేజ్​మెంట్​ఈ ఘటన గురించి ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదు. దీంతో పోలీసులే విషయం తెలుసుకుని వచ్చి ఎంక్వైరీ చేశారు. అయితే, షరీఫ్ ​మాత్రం మధుపై కేసు పెట్టొద్దని పోలీసులను కోరాడు. తామంతా పవన్​ కల్యాణ్​ అభిమానులమని, తొందరపాటులో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అనడం కొసమెరుపు .