- జై పవన్ నినాదాలు చేస్తుండగా లొల్లి
- పేపర్లు చింపే కత్తితో గొంతు కోసిన అభిమాని
- నిందితుడిపై కేసు వద్దన్న బాధితుడు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పవన్కల్యాణ్ నటించిన బీమ్లానాయక్ రిలీజ్రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త ముదిరి కత్తితో అటాక్ చేసేవరకు వెళ్లింది. పాల్వంచలోని వేణుగోపాల్(వేంకటేశ్వర) థియేటర్లో శుక్రవారం బీమ్లా నాయక్ సినిమా రిలీజయ్యింది. మ్యాట్నీ షో టికెట్ల కోసం కౌంటర్వద్ద పవన్ ఫ్యాన్స్పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఇందులో పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన షరీఫ్..కొత్తగూడెంకు చెందిన మధు వర్గాలున్నాయి. వీళ్లిద్దరికి చాలారోజులుగా పడడం లేదు. ఇందులో కొంతమంది మద్యం మత్తులో ఉండడమే కాకుండా థియేటర్కి బీర్ బాటిల్స్ పట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా రెండు వర్గాలు పోటా పోటీగా జై పవన్..జై జై పవన్ అంటూ నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది గొడవకు దారి తీసింది. ఆవేశానికి లోనైన మధు పేపర్లు చింపడానికి తీసుకువచ్చిన కత్తి తీసి షరీఫ్ గొంతు కోశాడు. రక్తం కారుతుండడంతో అతడిని మిగిలిన ఫ్యాన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అయితే థియేటర్ మేనేజ్మెంట్ఈ ఘటన గురించి ఎలాంటి కంప్లయింట్ ఇవ్వలేదు. దీంతో పోలీసులే విషయం తెలుసుకుని వచ్చి ఎంక్వైరీ చేశారు. అయితే, షరీఫ్ మాత్రం మధుపై కేసు పెట్టొద్దని పోలీసులను కోరాడు. తామంతా పవన్ కల్యాణ్ అభిమానులమని, తొందరపాటులో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అనడం కొసమెరుపు .