- గోదావరి ఒడ్డున 22 ఎకరాలు కేటాయింపు.. పొంచి ఉన్న ముంపు ముప్పు
- ఎంసీహెచ్, నర్సింగ్ కాలేజీ సైతం అక్కడే..
- ఇప్పటికే నీటమునిగిన ఎంసీహెచ్
- సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రతిపక్షాల డిమాండ్
మంచిర్యాల, వెలుగు:మంచిర్యాలలో మెడికల్ కాలేజీ నిర్మాణంపై అయోమయం నెలకొంది. గోదావరి ఒడ్డున ఉన్న భూదాన్ భూముల్లో 22 ఎకరాలను మెడికల్, నర్సింగ్ కాలేజీల కోసం కేటాయించారు. ఈ ప్రాంతమంతా గోదావరి వరదల్లో మునిగిపోతోంది. అదే భూముల్లో కట్టిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) మొన్నటి వరదలకు పూర్తిగా నీటమునిగింది. ప్రతి సంవత్సరం వరద ముప్పు పొంచి ఉండడంతో మెడికల్కాలేజీని వేరే ప్రాంతంలో నిర్మించాలని, ఎంసీహెచ్ను సైతం సురక్షిత ప్రాంతానికి తరలించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టరేట్కు పనికిరాదన్న చోట...
గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీలు మంజూరు కాగా అందులో మంచిర్యాలకు ఒకటి దక్కింది. దీనిని జిల్లాలో ఎక్కడ నిర్మించాలనే తర్జనభర్జనల తర్వాత జిల్లా కేంద్రంలోనే ఖరారు చేశారు. మెడికల్కాలేజీకి 20 ఎకరాలకు పైగా స్థలం అవసరం కావడంతో పలుచోట్ల ప్రభుత్వ భూములను పరిశీలించారు. చివరకు గోదావరి రోడ్డులో నది ఒడ్డున ఉన్న భూదాన్ భూముల్లో నిర్మించాలని నిర్ణయించారు. 207, 208 సర్వే నంబర్లలో 22 ఎకరాలను కేటాయించారు. 2017లో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్నిర్మించాలనుకున్నారు. ఆర్ అండ్బీ అధికారులు సాయిల్టెస్ట్ చేసి కలెక్టరేట్నిర్మాణానికి ఆ స్థలం అనుకూలం కాదని రిపోర్టు ఇచ్చారు. దీంతో కలెక్టరేట్ను నస్పూర్మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నారు. నాడు కలెక్టరేట్కు పనికి రాదన్న స్థలాన్నే నేడు మెడికల్కాలేజీ కోసం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు వీటిని పట్టించుకోలేదు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ముంపు
మెడికల్కాలేజీకి కేటాయించిన స్థలం గోదావరికి కూతవేటు దూరంలోనే ఉంది. అది పూర్తిగా లోతట్టు ప్రాంతం. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్వాటర్తో గోదావరి ఎండాకాలం కూడా నిండు కుండను తలపిస్తోంది. వానాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా నీట మునుగుతోంది. ఇప్పటికే భూదాన్ భూముల్లో నిర్మించిన ఎంసీహెచ్పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు ఎంసీహెచ్ మెట్ల దాకా నీళ్లు రాగా, మొన్నటి వరదలకు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగింది. ఎంసీహెచ్దాటుకొని సుమారు 500 మీటర్ల వరకు వరద పోటెత్తింది. ముంపును ముందుగానే పసిగట్టిన అధికారులు రాత్రికి రాత్రే పేషెంట్లను గవర్నమెంట్హాస్పిటల్కు తరలించడంతో ప్రమాదం తప్పింది. విలువైన మెషిన్లు మునిగిపోవడంతో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది.
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..
గోదావరి ఒడ్డున ఏటా ముంపు ముప్పు పొంచి ఉంటుందని, ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రతిపక్షాల లీడర్లు హెచ్చరిస్తున్నారు. పట్టణంలో మెడికల్ కాలేజీకి అనువైన స్థలాలు ఉన్నప్పటికీ ముంపు ప్రాంతంలో నిర్మించాలనుకోవడం తగదని విమర్శిస్తున్నారు. గవర్నమెంట్హాస్పిటల్కు ఎదురుగా ఉన్న ఐబీ గెస్ట్హౌస్ఆవరణలో ఇంటిగ్రేటెడ్మార్కెట్ను నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ను ఎంసీహెచ్కు కేటాయించి మార్కెట్ను మరో చోటికి షిఫ్ట్ చేయాలని సూచిస్తున్నారు. ముంపు ప్రాంతంలో నిర్మించిన ఎంసీహెచ్ను రీ ఓపెన్చేస్తే అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు, మాజీ ఎమ్మెల్సీ కె. ప్రేంసాగర్రావు హెచ్చరించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సైతం మెడికల్ కాలేజీని ముంపు లేని ప్రాంతంలో నిర్మించాలని, అక్కడికే ఎంసీహెచ్ను తరలించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది.
