- మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలను విమర్శిస్తే ఖబడ్డార్
చెన్నూర్, వెలుగు: చెన్నూర్నియోజకవర్గంలో సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను అడ్డుకొని మంత్రి వివేక్వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణను బద్నామ్ చేసేందుకు బీఆర్ఎస్నాయకులు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్లీడర్లు మండిపడ్డారు. కాంగ్రెస్నేతలు ఆదివారం సాయంత్రం చెన్నూర్ మార్కెట్ యార్డును సందర్శించి వడ్ల అన్లోడింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు వడ్ల కొనుగోళ్లు సరిగా సాగడం లేదంటూ చేసిన ఆరోపణలను ఖండించారు. మంత్రి వివేక్చొరవతో నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు. రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో బస్తాకు ఐదు కిలోలు కటింగ్పెట్టి రైతులను దోచుకున్నారని ఫైర్అయ్యారు.
నాడు మార్కెట్కమిటీ చైర్మన్గా ఉన్న మూల రాజిరెడ్డి పత్తి యార్డులో మంటలు పెట్టి రూ.కోట్ల స్కామ్లు చేశాడని.. అలాంటి వ్యక్తి మంత్రి, ఎంపీలను విమర్శించడమా అని మండిపడ్డారు. చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మంత్రి, ఎంపీల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మార్కెట్కమిటీ చైర్మన్మహేశ్ తివారి, మున్సిపల్వైస్చైర్పర్సన్ వినయ్కుమార్, మాజీ జడ్పీటీసీ కరుణసాగర్రావు, లీడర్లుహిమవంతరెడ్డి, పెద్దింటి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ నవాజుద్దీన్, చెన్నూర్మాజీ సర్పంచ్కృష్ణ, బ్లాక్కాంగ్రెస్ప్రెసిడెంట్రాజమల్లగౌడ్, చెన్నూర్మండల కాంగ్రెస్ప్రెసిడెంట్ బాపగౌడ్, కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ గురించి పరుష పదజాలంతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్ పై పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేశారు.
