మన్మోహన్​ రాజ్యసభ సీటు కోసం..రాజస్థాన్ వైపు కాంగ్రెస్​ చూపు

మన్మోహన్​ రాజ్యసభ సీటు కోసం..రాజస్థాన్ వైపు కాంగ్రెస్​ చూపు

మాజీ ప్రధాని మన్మోహన్‌‌ సింగ్‌‌ ను రాజ్యసభకు పంపించేందుకు కాంగ్రెస్​ రాజస్థాన్​ వైపు చూస్తోంది. రాజస్థాన్​ బీజేపీ చీఫ్, రాజ్యసభ సభ్యుడు మదన్​లాల్​సైనీ మరణంతో ఖాళీ అయిన సీటుకు మన్మోహన్​ను పోటీచేయించాలని భావిస్తోంది. ఇందుకు  డీఎంకే నిరాకరించింది.. అస్సాం, గుజరాత్‌‌ నుంచీ కుదరకపోవడంతో రాజస్థాన్​ వైపు నేతలు దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని, త్వరలో ఎన్నికలు జరగబోయే రాజ్యసభ సీటును కూడా గెల్చుకుంటామని పేర్కొన్నాయి.