చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుల నియామకం

చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుల నియామకం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పట్టణ, మండలాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్లను డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్​రెడ్డి మంగళవారం ప్రకటించారు. మందమర్రి మండల(రూరల్) ప్రెసిడెంట్​గా​ కడారి జీవన్​కుమార్, టౌన్​ప్రెసిడెంట్​గా​మండ తిరుమల్​రెడ్డి, క్యాతనపల్లి టౌన్​ ప్రెసిడెంట్​గా​ ఒడ్నాల శ్రీనివాస్, జైపూర్​మండలాధ్యక్షుడిగా విశ్వంభర్​రెడ్డి, భీమారం అధ్యక్షుడిగా పొడేటి రవి, కోటపల్లి మండల అధ్యక్షుడిగా కాటరం మల్లయ్యను ఎన్నుకున్నారు. పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​గౌడ్​ఆదేశాలతో ఈ నియామకం చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్​శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త అధ్యక్షులు కృషి చేయాలని డీసీసీ సూచించారు.