జైపూర్(భీమారం), వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భీమారం మండలంలోని 10 గ్రామపంచాయతీల్లో జరగబోయే ఎన్నికలకు తొమ్మిందిటిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి సోమవారం ప్రకటించారు. సాయంత్రం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
భీమారం పంచాయతీ అభ్యర్థిగా అలకాటి భాగ్యలక్ష్మి, బూరుగుపల్లికి మాడే మల్లేశ్, ధర్మారానికి దాసరి సంపత్, దాంపూర్కు గుండ స్వప్న, ఎల్కేశ్వరానికి బోయిరి జయ, కాజిపల్లికి ప్యాగ లక్ష్మి, కొత్తపల్లికి అనమల్ల అశోక్, మద్దికల్కు పొతెం సమ్మయ్య, నర్సింగాపూర్కు పెద్దల రూప పేర్లను ప్రకటించారు. ఆరేపల్లి సర్పంచ్ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. జైపూర్ మండలంలోని 20 గ్రామపంచాయతీలకు 16 గ్రామాలకు పేర్లను ప్రకటించారు.
జైపూర్కు బెజ్జాల వేముల స్రవంతి, మండలంలోని ఎల్కంటికి గుడేల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగిపల్లికి సుందిళ్ల రాజేశ్వరి, జైపూర్ కు కూన భాస్కర్, కానుకూరుకు పళ్ల చిలుక, కిష్టాపూర్కు దుర్గం మహేశ్, ముదిగుంటకు బత్తుల సుజాత, నర్సింగాపూర్ కు పండుగ రాజన్న, నర్వకు ఆగిడి స్రవంతి, పెగడపల్లికి రామగిరి నరేశ్, పౌనూర్కు తుమ్మల లక్ష్మి,షెట్పల్లికి జాగేటి సరస్వతి, శివ్వారానికి అంజయ్య గౌడ్, టేకుమట్లకు బల్ల వెంకటేశ్, వేలాలకు డేగ స్వప్న పేర్లను ప్రకటించారు. రామారావు పేట, ఇందారం, కుందారం, మిట్టపల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.
మందమర్రి మండల సర్పంచ్ అభ్యర్థుల ఖరారు
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి మండలం పరిధిలోని 10 పంచాయతీలకు గాను ఏడు స్థానాల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థుల జాబితాను డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి ప్రకటించారు.
ఆదిల్పేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల అంజయ్య, ఆందుగులపేటకు ముత్యం రమారాజేశ్, బొక్కలగుట్ట పంచాయతీకి మాసు శ్రీనివాస్, మామిడిగట్టుకు గజ్జె భాను, పులిమడుగుకు ధరావత్ నందిని వినోద్, సారంగపల్లికి ఆసంపల్లి రాజయ్య, శంకర్పల్లి పంచాయతీ అభ్యర్థిగా మేసినేని మేఘన పేర్లను ప్రకటించారు. కాగా మండలంలోని చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్పంచాయతీల అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు.

