పార్లమెంట్ ఎన్నికల్లో చేరికల పైనే కాంగ్రెస్ ఫోకస్

పార్లమెంట్ ఎన్నికల్లో చేరికల పైనే కాంగ్రెస్ ఫోకస్

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. పోలింగ్​కు చాలా టైం ఉండడంతో స్లో అండ్​ స్టడీ అన్న ధోరణిలో అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ​క్యాండిడేట్లు ఫైనల్​అయినప్పటికీ.. ఆ పార్టీలు ప్రచారంలో మాత్రం స్పీడ్​ పెంచడం లేదు. అధికార కాంగ్రెస్​పార్టీకి సంబంధించి మరో ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్​కాలేదు.

ఒకటి, రెండు రోజుల్లో వారి లిస్ట్​ కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.​ అయితే, బీజేపీ, కాంగ్రెస్​ రెండు పార్టీలు చేరికల మీద దృష్టి పెట్టగా.. తమ పార్టీ లీడర్లను, క్యాడర్​ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ​నిమగ్నమైంది. 

చేరికలపైనే కాంగ్రెస్ ఫోకస్ 

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేరికలపైనే ఫోకస్​ పెట్టింది. అలాగే, ఏప్రిల్​ మొదటి వారంలో రాహుల్​ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో తెలుగులో మేనిఫెస్టో రిలీజ్​ చేయించే సభను తుక్కుగూడలో ఏర్పాటు చేస్తోంది. ఆ తరువాత రేవంత్ రెడ్డి వరుస ఎన్నికల ప్రచార సభలను ప్లాన్​ చేసుకున్నారు. ప్రతి పార్లమెంట్​నియోజకవర్గంలో కనీసం రెండు,  మూడు సభలు పెట్టాలని చూస్తున్నారు.

ALSO READ :- ఎవర్ని వదలలేదు : ఫోన్ ట్యాపింగ్ లో రియల్ ఎస్టెట్ జ్యువెలరీ వ్యాపారులు

రాహుల్, ప్రియాంక గాంధీతోనూ సభలు, ర్యాలీలకు ప్లాన్​ చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు 'పాంచ్​ న్యాయ్'ను జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా 14 సీట్లు గెలవాలని చూస్తున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ప్రతి రోజూ తన నివాసంలో లీడర్లతో భేటీ అవుతున్నారు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సూచనలు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్​స్థానాల్లో మల్కాజ్ గిరి మాదిరిగా మూడంచెల వ్యూహం అమలు చేయాలని చూస్తున్నారు.