తెలంగాణకు విముక్తి కలిగించిందీ ..రాష్ట్రం ఇచ్చిందీ కాంగ్రెస్సే: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

తెలంగాణకు విముక్తి కలిగించిందీ ..రాష్ట్రం ఇచ్చిందీ కాంగ్రెస్సే: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

నాడు, నేడు తెలంగాణకు మేలు చేసింది కాంగ్రెస్సే అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. నాడు నిజాం నిరంకు శ పాలననుంచి విముక్తి చేసింది జవహర్ లాల్ నెహ్రు, వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే.. తెలంగాణ ఇచ్చింది సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగుతోంది.. నియంత పాలనను తరిమికొట్టేందుకు తుక్కుగూడ సభ ద్వారా సోనియా శంఖం పూరించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మేలు కోరే సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ .. అనేక ఉచిత పథకాలను  తుక్కుగూడ సభ సాక్షిగా  ప్రకటించారని అన్నారు కోమటిరెడ్ది.

గత పదేళ్లలో కేసీఆర్ పాలనలో ఎవ్వరికీ మేలు జరగలేదని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సీఎం కేసీఆర్ అమలు చేయలేదని కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. రైతులకు 24 గంటల  కరెంట్ ఉత్తి మాటే..ఏ ఒక్క చోట ఉచిత కరెంట్ అమలు కావడంలేదని ఆరోపించారు. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశారని కోమటిరెడ్డి విమర్శించారు. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.