
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలో హత్యకు గురైన సహస్ర కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేశ్ అన్నారు. మంగళవారం బాలిక కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి సహకారం అందిస్తామని చెప్పారు.