పబ్లిక్ సెక్టార్ ను లూటీ చేసి..దోస్తులకు పంచి పెట్టడమే మోడీ పని

పబ్లిక్ సెక్టార్ ను లూటీ చేసి..దోస్తులకు పంచి పెట్టడమే మోడీ పని

పబ్లిక్ సెక్టార్ ను లూటీ చేసి.. దోస్తులకు పంచి పెట్టడమే మోడీ పనిగా పెట్టుకున్నారన్నారు రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం.. జాతీయ సంపదను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్మేస్తే... రిజర్వేషన్లు పూర్తిగా పోతాయన్నారు. మోడీ ఇన్ డైరెక్ట్ గా రిజర్వేషన్లు ఎత్తేసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తు లో నాగార్జున సాగర్ డ్యాంను లీజ్ కు ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.