
పటాన్చెరు, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. బుధవారం ఆయన చిట్కుల్లోని తన క్యాంప్ ఆఫీసులో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులకు చెక్కులు అందజేశారు. గుమ్మడిదల మండలం కానుటుకుంట గ్రామానికి చెందిన ఎల్లబోయిన రాములుకు రూ.లక్షా 4 వేలు, అన్నారం గ్రామానికి చెందిన చింతగుడ్డి సువర్ణకు రూ.55 వేలు, మంబాపూర్ గ్రామానికి చెంనది కంజర్ల శ్రీనివాస్కు రూ.60 వేలు, పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పి.శంబతకు రూ.లక్షా 9వేల చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న పేదలు అప్పుల పాలు కాకూడదన్న ఉద్ధేశ్యంతో సీఎం రిలీఫ్ఫండ్ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.