
- ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి హిందువులంటే గౌరవమని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ, ఆ పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ గురించి మాత్రమే సభలో ప్రస్తావించారని ఆమె తెలిపారు. రాహుల్ కామెంట్లను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఆరోపణల్లో నిజం లేదని ప్రియాంక అన్నారు.