కళాకారుల సాంప్రదాయ నృత్యానికి ముగ్ధురాలైన ప్రియాంక గాంధీ

కళాకారుల సాంప్రదాయ నృత్యానికి ముగ్ధురాలైన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న ఈ యాత్రలో ప్రియాంక.. సాంప్రదాయ జానపద  నృత్యాలు చేస్తున్న కళాకారులతో చేతులు కలిపారు. వారు చేసే డ్యాన్స్ కు మైమరిచి, చప్పట్లు కొడుతూ అందర్నీ హుషారుపరిచారు.

మరోవైపు.. రాహుల్ గాంధీ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ రోజు రాజస్థాన్ కు సోనియాగాంధీ వెళ్లనున్నారు. రాహుల్ తో పాటు యాత్రలో ఆమె కొంతదూరం నడవనున్నారు.

నిన్న పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. మళ్లీ ఈ రోజు పాదయాత్ర ఎప్పటిలానే  ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకూ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల మీదుగా రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ కొనసాగింది. కర్ణాటకలో సాగిన పాదయాత్రలో సోనియాగాంధీ..రాహుల్ వెంట కొంతదూరం నడిచారు. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ లో రాహుల్ వెంట నడవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెప్టంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ మూడు నెలల నుంచి కొనసాగుతోంది.