కోర్టుల చుట్టూ తిరుగుతున్న రాహుల్

కోర్టుల చుట్టూ తిరుగుతున్న రాహుల్

అహ్మదాబాద్​: పరువునష్టం కేసుల్ని  ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. హోం మంత్రి అమిత్​ షాను హంతకుడిగా ఆరోపించిన కేసులో ఆయన శుక్రవారం అహ్మదాబాద్​ కోర్టుకు హాజరయ్యారు. దీంతోపాటు అహ్మదాబాద్​ జిల్లా కోఆపరేటివ్(ఏడీసీ)​ బ్యాంక్​ దాఖలు చేసిన కేసులోనూ రాహుల్ విచారణ ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో అమిత్​ షా చైర్మన్​గా ఉన్న ఏడీసీ బ్యాంకు కేంద్రంగా అక్రమాలు జరిగాయంటూ రాహుల్​ చేసిన ఆరోపణలపై బ్యాంకు అధికారులు పరువునష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లో రాహుల్​కు బెయిల్​ లభించింది. విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్​ను డిసెంబర్​ 7న విచారిస్తామని కోర్టు తెలిపింది. ప్రధాని మోడీపై అనుచిత కామెంట్లు చేసిన మరో కేసులో కాంగ్రెస్​ ఎంపీ గురువారం సూరత్​ కోర్టుకు వెళ్లారు. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్​ మూడు రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొంటారు.