
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మైనారిటీలను అభివృద్ధి చేసే దిశగా మైనారిటీ డిక్లరేషన్ను రూపొందిస్తున్నామని కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ తెలిపారు. వారి సంక్షేమం కోసం రూ.5 వేల కోట్ల బడ్జెట్కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లాగానే మైనారిటీ సబ్ ప్లాన్నూ డిక్లరేషన్లో పొందుపరుస్తామని వెల్లడించారు. గురువారం ఆయన హోటల్గోల్కొండలో మైనారిటీ డిక్లరేషన్కమిటీ చివరి సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ..షాదీముబారక్కు ప్రస్తుతం ఇస్తున్న అమౌంట్ను పెంచుతామని చెప్పారు. మతపరమైన వివక్షను అణచివేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అంతేగాకుండా మైనారిటీల కోసం ప్రత్యేకంగా మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ మైనారిటీ యూనివర్సిటీని నెలకొల్పేలా డిక్లరేషన్లో పెడతామని చెప్పారు. డిక్లరేషన్కు సంబంధించి ముస్లిం, క్రైస్తవులు, జైనులు, దళిత ముస్లింల నుంచి దాదాపు 150 సలహాలు వచ్చాయని వివరించారు.
వాటిన్నింటినీ పరిశీలించి మంచి పథకాలను డిక్లరేషన్లో పెడతామని వెల్లడించారు. మైనారిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా వివక్షకు గురి చేసిందని తెలిపిన షబ్బీర్అలీ.. కాంగ్రెస్ తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 3 శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. డిక్లరేషన్ను సమగ్రంగా తయారు చేసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేస్తామని పేర్కొన్నారు.