ఆ నలుగురే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను దోచుకుతిన్నారు: విజయశాంతి

ఆ నలుగురే..  నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను దోచుకుతిన్నారు: విజయశాంతి

బీజేపీ..బీఆర్ ఎస్ ఒక్కటే.. కేసీఆర్ను మరోసారి గద్దెనెక్కించాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై దండయాత్ర చేసింది.. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి సరఫరాతో ప్రజలపై దండయాత్ర చేసి దోపిడీ చేశారని విజయశాంతి ఆరోపించారు. 317 జీవో తో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేశారని అన్నారు.యువత, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు.

కేసీఆర్, ఆయన కూతురు,కొడుకు, అల్లుడు వారి బినామీలు తెలంగాణలోని నాలుగు కోట్లు జనాభాను దోచుకుతిన్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు తిన్నారు.. కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుందని అన్నారు విజయశాంతి.    

బీజేపీ.. 420గాళ్లతో చేతులు కలిపింది.. కేసీఆర్ ను గెలిపించే ప్రయత్నం చేస్తుంది.. కేసీఆర్ గెలిస్తే.. తెలంగాణ ప్రజలు మరోసారి దోపిడీకి గురవుతారు.. కాంగ్రెస్ ను గెలిపించి దోపిడీకి చరమగీం పాడి తెలంగాణ ప్రజలను రక్షించాలని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు.