
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు కరెంట్కష్టాలు లేకుండా చేసిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పాలన చేతకాక కాంగ్రెస్నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘అప్పులు చేసినా.. ప్రజలకు 24 గంటల కరెంట్ఇచ్చింది కేసీఆర్ పాలనలోనే..’’ అని ప్రజలకు తెలుసన్నారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
2014లో విద్యుత్రంగంలో రూ.22 వేల కోట్ల అప్పు ఉందని, అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ప్రభుత్వం 3 గంటల కరెంట్కూడా సరిగా ఇవ్వలేకపోయిందన్నారు. అప్పుడు వారు మిగిల్చిన అప్పు ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగిందన్నారు. అప్పులు తీర్చడం చేతకాకపోతే.. అప్పులు తెచ్చిన సంస్థలకే విద్యుత్సంస్థలను అప్పగిస్తే వాళ్లే నడుపుకుంటారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రాద్రి జిల్లా పర్యటనలోనూ అప్పుల గురించే చెబుతున్నారని, కరెంట్రంగంలో సాధించిన ప్రగతి ఏంటో తాము ఇప్పటికే చెప్పామన్నారు.
భద్రాద్రి పవర్ప్లాంట్ లో ఉన్నసబ్క్రిటికల్టెక్నాలజీతో 30కి పైగా ప్లాంట్లు ఆపరేషన్లో ఉన్నాయన్నారు. విద్యుత్చట్టంలోనే సబ్క్రిటికల్టెక్నాలజీ మార్చుకోవచ్చని ఉందని, దాన్ని తాము ఫాలో అయ్యామని, అసెంబ్లీలోనూ ఇదే విషయం చెప్పామన్నారు. లేని సమస్యను భట్టి పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన ఇప్పటికైనా అప్పుల గురించి మాట్లాడటం మాని తన శాఖలపై దృష్టి పెట్టాలని సూచించారు.
లంకె బిందెల గురించి సీఎం మాట్లాడుతున్నారని, కాంగ్రెస్అధికారం కోల్పోయిన రాజస్థాన్, చత్తీస్గఢ్లో లంకె బిందెలు అప్పజెప్పి పోయారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డలో మంత్రులు రౌడీల్లా మాట్లాడారని, వారి తీరు అసెంబ్లీలో, బయట అలాగే ఉందన్నారు. విద్యుత్రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దిన ప్రభాకర్రావును దుర్భాషలాడారని, సభలో లేని వ్యక్తిపై నిందలు వేశారన్నారు. సీఎం, మంత్రులు చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ నిజాయతీని నిరూపించుకునేందుకు ఇప్పటికే న్యాయ విచారణ కోరామని అన్నారు.