
కోల్బెల్ట్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజూరాబాద్ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. క్యాతనపల్లిలో మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్లీడర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు కలిసి ఆర్కేపీ క్రాస్ రోడ్ వద్ద ఆందోళన చేపట్టారు. పార్వతి విజయ మాట్లాడుతూ.. సీఎం రేవంత్పై ఇష్టానుసారంగా మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయంలో కాంగ్రెస్సర్కార్అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు మంజూరు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ లీడర్లు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదన్నారు. కౌశిక్ రెడ్డి వెంటనే సీఎంకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీటీసీ రాంటెంకి విజయ, బెదిరి లక్ష్మి, పద్మ, కల్పన, విజయలక్ష్మి, సీత, రాజేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు.