ఉద్రిక్తంగా కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్.. పోలీసుల అదుపులో రేవంత్

ఉద్రిక్తంగా కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్.. పోలీసుల అదుపులో రేవంత్

 రాహుల్ ఈడీ విచారణకు వ్యతిరేకంగా టీపీసీసీ పిలుపునిచ్చిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్  సర్కిల్ వద్ద  కాంగ్రెస్ శ్రేణులు స్కూటీకి నిప్పుపెట్టడంతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాకుండా బస్ ఎక్కి ఆందోళన  చేశారు.  రాజ్ భవన్ వైపు వెళ్లకుండా  పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. వాటిని తోసుకుని  కాంగ్రెస్ నేతలు రేవంత్ తో పాటు పలువురు నేతలు పరుగెత్తారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, అంజన్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రేవంత్ ను  బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు.  

కాంగ్రెస్ నేతలపై పోలీసుల లాఠీచార్జ్

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో పాటు వందలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురికి గాయలయ్యాయి. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు. పోలీసులు తమని రెచ్చగొట్టం వల్లే వాహనాలను ధ్వంసం చేశారమన్నారు . ఘర్షణలో కొందరు సంఘవిద్రోహా శక్తులు చేరి తమ పార్టీని దెబ్బతీసే కుట్ర చేశారన్నారు నేతలు. కాంగ్రెస్ నేతల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ కొద్ది నిలిచిపోయాయి. 

పోలీస్ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అడ్డుకున్న పోలీసులతో రేణుకా చౌదరి వాగ్వాదానికి దిగింది. ఓ పోలీసు కాలర్ ను పట్టుకుంది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తున్నారంటూ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది టీపీసీసీ. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఐడీ కార్డు ఉంటేనే రాజ్ భవన్ సిబ్బందిను కూడా లోపలకి అనుమతిస్తున్నారు. మరో వైపు రాజ్ భవన్ ముట్టడికి పిలునివ్వడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.