
సిద్దిపేట, రామాయంపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామిని సోమవారం హైదరాబాద్ లో పలువురు కాంగ్రెస్నేతలు మర్యాదపూర్వకంగా కలిసి బొకే, శాలువాతో సన్మానించారు. వారిలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి, నాయకుడు దేవులపల్లి యాదగిరి, సిద్దిపేట కౌన్సిలర్లు సాకి బాల్ లక్ష్మి ఆనంద్, మహేందర్, పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్, నంగునూర్, నారాయణ రావు పేట, సిద్దిపేట రూరల్, అర్బన్, మండలల అధ్యక్షులు తప్పేట శంకర్, బర్మ రాములు, గరిపల్లి రాములు, రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడు మల్లేశం
ఉపాధ్యక్షుడు మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు రాజేశం, జిల్లా యూత్ కార్యదర్శి రవీందర్, సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్, సంగారెడ్డి అంబేద్కర్ స్టడీ సర్కిల్ అధ్యక్షుడు రామారావు, మాజీ సర్పంచులు సదానందం, జగదీశ్వర్, హనుమంతు, నాయకులు మురహరి, శేఖర్, యాదగిరి, సురేశ్, పోతురాజు, ప్రభాకర్, అశోక్, తరుణ్, మహేశ్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారిని కాపాడుకుంటానని తెలిపారు.