ఎంపీకి ప్రొటోకాల్​ ఇవ్వలేదని అడిగితే నిందలా : కాంగ్రెస్‌‌ లీడర్లు

ఎంపీకి ప్రొటోకాల్​ ఇవ్వలేదని అడిగితే నిందలా : కాంగ్రెస్‌‌ లీడర్లు
  • ఎస్సీ వర్గీకరణను వివేక్​ ఎక్కడా అడ్డుకోలేదు.. 
  • మీడియా సమావేశంలో కాంగ్రెస్​ లీడర్లు 

గోదావరిఖని, వెలుగు: సరస్వతీ పుష్కరాల సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్‌‌ పాటించలేదని అడిగితే నిందలు వేస్తారా అని కాంగ్రెస్‌‌ లీడర్లు పి.మల్లికార్జున్‌‌, రాచకొండ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్​ క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ ముద్రించిన ఫ్లెక్సీలోనూ ఎంపీ ఫొటో లేదని, ఆయనకు ఆహ్వానం కూడా లేదని దేవాదాయ శాఖ ఆఫీసర్లను ప్రశ్నిస్తూ పలు చోట్ల కాంగ్రెస్​ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేశారే తప్ప ఎక్కడా మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు పేరును ప్రస్తావించలేదన్నారు. ఎస్సీ వర్గీకరణను చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఎక్కడా అడ్డుకోలేదని, కేవలం మాలలకు న్యాయం చేయాలని కోరారన్నారు. 

ఐఎన్‌‌టీయూ సెక్రటరీ జనరల్​బి.జనక్​ప్రసాద్​ ఆదేశాలతో కొందరు పనిగట్టుకుని కాకా ఫ్యామిలీపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సింగరేణిలో ఐఎన్‌‌టీయూసీ గుర్తింపు సంఘంగా గెలవకపోవడానికి జనక్​ ప్రసాదే కారణమని విమర్శించారు. యూనియన్‌‌ను ఆయనే భ్రష్టు పట్టించారని ఆరోపించారు. మినిమమ్​ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌‌గా రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను పెంచాల్సింది పోయి తగ్గించారని ఆరోపించారు. కాకా ఫ్యామిలీ వల్లే చాలా మంది సింగరేణిలో లీడర్లు అయ్యారన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. మీటింగ్‌‌లో లీడర్లు గోవర్ధన్‌‌రెడ్డి, విజయ్, మధు, మల్లేశ్‌‌ యాదవ్, సురేందర్​, రఫీక్, విజయ్, రాజేందర్ పాల్గొన్నారు.