అర్ధగంట టైమిస్తే అలంపూర్ ఏంటో కేటీఆర్ కు చూపిస్తాం

అర్ధగంట టైమిస్తే అలంపూర్ ఏంటో కేటీఆర్ కు చూపిస్తాం

మంత్రి కేటీఆర్ టూర్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకొని...అయిజ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.  

అర్థగంట టైమిస్తే కేటీఆర్ కు అలంపూర్ అంటే ఏంటో  చూపిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. కేసీఆర్, కేటీఆర్ రెండుసార్లు అలంపూర్ కు వచ్చి హామిలిచ్చి.. మాయమాటలతో ప్రజలను మోసం చేశారన్నారు. హామీలను నెరవేర్చాల్సింది పోయి.. అరెస్టులు చేయడం సరికాదన్నారు. మూడేళ్ల కింద వంద పడకల ఆస్పత్రి మంజూరు అయితే ఇప్పటివరకు నిర్మించలేదన్నారు. తుమ్మిళ్ల రిజర్వాయర్, అలంపూర్ బస్ డిపో లాంటి హామీలన్నీ గాలికే పోయాయన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే హామీలు అమలు చేయాలన్నారు సంపత్.