జిల్లెలగూడ సందచెరువు కట్టపై కాంగ్రెస్ నేతల రాస్తారోకో

జిల్లెలగూడ సందచెరువు కట్టపై కాంగ్రెస్ నేతల రాస్తారోకో

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడ సందచెరువు కట్టపై కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చెరువుకట్టపై రాస్తారోకో నిర్వహించారు. మంత్రి సబిత మెప్పు కోసం అధికారులు.. జిల్లెలగూడ సందచెరువు కట్ట మధ్యలో బతుకమ్మ వేడుకల పేరుతో ఏర్పాట్లు చేస్తున్నారని, దీని వల్ల రోడ్లు బ్లాక్ చేయడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ  నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.