ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల సస్పెన్షన్

ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల సస్పెన్షన్

హైదరాబాద్, వెలుగు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు నేతలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

సస్పెండ్​కు గురైన వారిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా పోటీ చేసిన సంజీవ రెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రాత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్ పాండే ఉన్నారు. వీరిని ఆరేండ్ల పాటు కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు.