కేటీఆర్ నిన్ను వదల..వేటాడుతా.. వెంటాడుతా : రాజగోపాల్​ రెడ్డి

కేటీఆర్ నిన్ను వదల..వేటాడుతా.. వెంటాడుతా : రాజగోపాల్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ఇన్నాళ్లూ వాళ్లు తడాఖా చూపించారని..ఇక నుంచి కేసీఆర్, కేటీఆర్ కు తమ తడాఖా ఏంటో చూపిస్తామని మునుగోడు కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి అన్నారు. ‘‘కేటీఆర్​.. గుర్తుంచుకో. నేను నిన్ను వదలను. వేటాడుతా.. వెంటాడుతా’’ అంటూ హెచ్చరించారు. గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా వీ6 వెలుగుతో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో తనపై కేటీఆర్​లేనిపోని ఆరోపణలన్ని చేశారని రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు.

ప్రజలకు పూర్తిగా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. కేసీఆర్​ ఇకపై ఇలాగే సైలెంట్​గా ఉండాలని సూచించారు. కడియం శ్రీహరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందన్నారు. తాము తలచుకుంటే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేస్తారన్నారు. తనతో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారని చెప్పారు. ప్రజలకు మంచి పాలన అందిస్తామని, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.