మంత్రి కేటీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

మంత్రి కేటీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లాకు గోదావరి జలాలు అందించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే  సీతక్క మంత్రి కేటీఆర్ ను కోరారు.  ములుగు కలెక్టరేట్ శంకుస్థాపన దగ్గర మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు సీతక్క.ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా రామప్ప నుండి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలన్నారు.   మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేసి.. గిరిజన యూనివర్సిటీ తరగతులు వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.  

పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని కేటీఆర్ ను కోరారు సీతక్క.  మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్ లో బిల్ట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలన్నారు. ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. మంగపేట కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాల,  గోవిందరావుపేట మండలం పసర కేంద్రంగా సమ్మక్క సారాలమ్మ నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలన్నారు.   మల్లంపల్లి, లక్ష్మీదేవిపేట, రాజుపేటలను మండలాలుగా ప్రకటించాలని కోరారు ఎమ్మెల్యే సీతక్క.