-
కవిత నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిలో ఉన్నరు
-
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేది కాంగ్రెస్ప్రభుత్వమే
-
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై శాసనమండలి సభ్యుడు బల్మూరి వెంకట్ఫైర్అయ్యారు. జీవో-3పై ఆమె మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కవిత లేవనెత్తే అంశాలపై చర్చకు తాము రెడీగా ఉన్నామని ఆయన స్పష్టంచేశారు. వెంకట్ మీడియాతో మాట్లాడుతూ ‘బీఆర్ఎస్హయాంలో హైకోర్టు ఆదేశాలు ఫాలో కాలేదు. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేని మీరు.. ఇప్పుడొచ్చి మట్లాడుతున్నరు. వెబ్ నోట్, మెమోలు విడుదల చేసి మోసం చేసింది మీరే. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట మీద నిలబడింది మేము. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ వాళ్లు తట్టుకోలేకపోతున్నరు. ప్రభుత్వంపైకి ఆటో కార్మికులను ఉసిగొల్పారు.. ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిలో ఉన్నరు.. తప్పు చేసింది మీరే.. ధర్నాలు చేస్తామంటున్నది మీరే’ వెంకట్ విరుచుకుపడ్డారు.