కాంగ్రెస్ మోసం చేసే పార్టీ కాదు..అన్నం పెట్టే పార్టీ

 కాంగ్రెస్ మోసం చేసే పార్టీ కాదు..అన్నం పెట్టే పార్టీ

మోసానికి మారుపేరే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కాంగ్రెస్ మోసం చేసే పార్టీ కాదని.. అన్నం పెట్టే పార్టీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...రైతు డిక్లరేషన్ ను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఓడిస్తామని తెలిపారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన 13 మంది ఎమ్మెల్యేలకు సవాల్ చేస్తున్నా..మిమ్మల్ని ఓడగొట్టే బాధ్యత నేనే తీసుకుంటా’’ అని కోమటిరెడ్డి అన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ అంతటా పర్యటించి..పార్టీ గెలుపుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.