ఉన్నావ్ బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్

ఉన్నావ్ బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లిని   కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. 125 మందితో ఇవాళ(గురువారం) ప్రకటించిన  తొలి జాబితాలో ఆమె పేరునూ ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఆశాసింగ్ ను ఎన్నికల బరిలో దించుతున్నామని ఆమె చెప్పారు.  ఆమెతో పాటు గోండు గిరిజనుల కోసం సోన్ భద్రలోని ఉంభా గ్రామంలో ఉన్న భూ సమస్యపై న్యాయపోరాటం చేస్తున్న రామ్ రాజ్ గోండ్ కూ టికెట్ ఇచ్చినట్టు తెలిపారు. గతేడాది నవంబర్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు వచ్చి, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న ఆశా వర్కర్ పూనమ్ పాండేకీ టికెట్ ఇచ్చామని తెలిపారు. సీఏఏ వ్యతిరేక అల్లర్లలో జైలుపాలైన కాంగ్రెస్ నేత సదాఫ్ జాఫర్ కూ టికెట్ ఇచ్చినట్టు చెప్పారు.

ఫస్ట్ జాబితాలో 50 మంది (40%) మహిళలకు టికెట్లు కేటాయించారు. మొత్తంగా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల్లో 40 శాతం యువతే ఉన్నారు. ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లికి టికెట్ ఇవ్వడం పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ చేతిలో ఎవరి బిడ్డైతే అన్యాయానికి గురైందో.. ఆమె ఇప్పుడూ న్యాయానికి ప్రతినిధిలా నిలబడతారని ట్వీట్ చేశారు. ‘పోరాడుతాం.. గెలుస్తాం’ అని తెలిపారు.
  
2017లో దళిత బాలికపై అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. 

మరిన్ని వార్తల కోసం..

తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు