రైతు రుణ మాఫీపై గాంధీభవన్ లో సంబరాలు

రైతు రుణ మాఫీపై గాంధీభవన్ లో సంబరాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల 2 లక్షల రూపాయల అప్పుల మాఫీ ప్రక్రియ ప్రారంభంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. తొలి విడత కింద లక్ష రూపాయలు మాఫీ కావటంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ లో కార్యకర్తలు, నేతల సంబరాలు మిన్నంటాయి. 

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో.. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయటం చరిత్రలో ఎప్పుడూలేదన్నారు నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను ఊరేగించారు. టపాసులు కాల్చి వేడుక చేసుకున్నారు కార్యకర్తలు. 

ప్రజా పాలన అంటే ఇదే అని.. రైతన్నలకు రుణ మాఫీ పండగ అని.. ఈ దశాబ్దపు అతి పెద్ద వేడుక అంటూ నినాదాలు చేశారు.