మరో ఐదుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

మరో ఐదుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల 9వ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. రాజస్థాన్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది.

సీపీ జోషి రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి, దామోదర్ గుర్జార్ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ నుంచి రక్ష రామయ్య, బల్లారి నుంచి తుకారామ్, చమరజ నగర్ నుంచి సునీల్ బోస్ లు పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ 9 జాబితాల్లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 213మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.

కాగా, ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు  ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించినుంది.