కాంగ్రెస్​ వస్తే కరెంట్​ కోతలు తప్పవు:  రసమయి బాలకిషన్​

కాంగ్రెస్​ వస్తే కరెంట్​ కోతలు తప్పవు:  రసమయి బాలకిషన్​

 కోహెడ(బెజ్జంకి)వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్​ కోతలు తప్పవని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. సోమవారం బెజ్జంకి రైతు వేదికలో రేవంత్​రెడ్డి 3 గంటల కరెంట్​పై మాట్లాడిన తీరుకు వ్యతిరేకంగా రైతులతో తీర్మానం చేయించారు. అనంతం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పాలనలో కరెంట్​ లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరని గుర్తు చేశారు. రేవంత్​ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్​లో పని చేస్తున్నరని ఆరోపించారు.

ALSO READ :ట్రాఫిక్ జామ్తో నరకయాతన.. గంటల కొద్ది రోడ్లపైనే వాహనాలు

సీఎం కేసీఆర్​ 24 గంటల కరెంట్​తో పాటు సాగు నీరు ఇస్తుంటే ఇది చూడని కాంగ్రెస్​ నాయకులకు కండ్లు మండుతున్నయని మండిపడ్డారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబును ప్రజలు ఏ విధంగా తరిమికొట్టారో కాంగ్రెస్​కు కూడా అదే గతి పడుతుందని అన్నారు.ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కవిత, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్​రెడ్డి, ఏఎమ్​సీ చైర్మెన్​ చంద్రకళ  పాల్గొన్నారు.