కోల్బెల్ట్, వెలుగు: మున్సిపల్ ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసిన పలు అభివృద్ది పనులకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్లీ ప్రారంభోత్సవాలంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ క్యాతనపల్లి మున్సిపల్ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు, లీడర్లతో కలిసి మాట్లాడారు. కొద్ది రోజుల కింద మంత్రి వివేక్ క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో రూ.85.28కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారన్నారు.
వీటితోపాటు కోట్లాది రూపాయలతో వైకుంఠధామం, గ్రేవ్ యార్డులు, ఖబరస్తాన్, రోడ్లు, సెంట్రల్లైటింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ ఆమోదంతో చేపట్టిన పనులకు ప్రస్తుత పాలకవర్గంలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మళ్లీ కొబ్బరికాయలు కొడుతూ తామే పనులు చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు పుల్లూరి తిరుమల, దాముక శిరీష, గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేశ్, ప్రభాకర్, డీసీసీ సెక్రటరీ శ్రీనివాస్, లీడర్లు
పాల్గొన్నారు.
