16 కార్పొరేషన్ల ఏర్పాటు చరిత్రాత్మకం : నీలం మధుముదిరాజ్

16 కార్పొరేషన్ల ఏర్పాటు చరిత్రాత్మకం : నీలం మధుముదిరాజ్

పటాన్​చెరు, వెలుగు : 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. క్యాబినెట్​ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం చిట్కుల్ లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్టంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు.

16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, రాములు, వెంకటేశ్, మురళి, కృష్ణ, ప్రభు, గోపాల్, అశోక్, శ్రీను, వెంకటేశ్, రాజ్ కుమార్, అంతయ్య, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.