జూబ్లీహిల్స్ ఎలక్షన్ : అభివృద్ధి, సంక్షేమాన్నే నమ్ముకున్న కాంగ్రెస్.. 2 రోజుల్లో అభ్యర్థిక ప్రకటన

జూబ్లీహిల్స్ ఎలక్షన్ : అభివృద్ధి, సంక్షేమాన్నే నమ్ముకున్న కాంగ్రెస్.. 2 రోజుల్లో అభ్యర్థిక ప్రకటన

తమ రెండేండ్ల పాలనను చూసి జూబ్లీహిల్స్ ఓటర్లు తమను గెలిపిస్తారని కాంగ్రెస్​ నమ్ముతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ఆ పార్టీ ప్రధానంగా నమ్ముకుంది. 

మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, 60 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ప్రచారం చేస్తున్నది. ఈ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు మూడో వంతు ఉండడంతో వారి మద్దతు కూడగట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

మజ్లిస్​ పార్టీ సపోర్టు కూడా తమకే ఉండటంతో కలిసి వస్తుందని కాంగ్రెస్​ భావిస్తున్నది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్​లో కాంగ్రెస్ ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. కానీ, ఆ తర్వాత కంటోన్మెంట్​కు జరిగిన ఉప ఎన్నికలో గెలవడం ద్వారా గ్రేటర్​లో ఖాతా తెరిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కంటోన్మెంట్ ఫలితమే రిపీట్​ అవుతుందని కాంగ్రెస్​ భావిస్తున్నది.