కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్..పోలీసుల భారీ బందోబస్తు

కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్..పోలీసుల భారీ బందోబస్తు

ఇవాళ కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ కు పిలుపునివ్వడంతో రాజ్ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు భారీ నిరసన ప్రదర్శన చేయనున్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తున్నారంటూ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది టీపీసీసీ. ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం నుంచి టీపీసీసీ ర్యాలీ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకున్నారు.  

పీజేఆర్  విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు.  దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఐడీ కార్డు ఉంటేనే రాజ్ భవన్ సిబ్బందిను కూడా లోపలకి అనుమతిస్తున్నారు పోలీసులు. మరో వైపు రాజ్ భవన్ ముట్టడికి పిలునివ్వడంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.