వనపర్తి జిల్లా మర్రికుంట దగ్గర విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఆస్పత్రికి తరలించగా…చికిత్స పొందుతూ చనిపోయాడు. మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నిన్న(సోమవారం) రాత్రి వాహనాలను తనిఖీ చేస్తూ కారును ఆపబోయాడు హెడ్కానిస్టేబుల్ సలీంఖాన్. అయితే కారును ఆపకుండా హెడ్కానిస్టేబుల్ను ఢీకొట్టి పరారీ అయ్యారు. దీంతో కానిస్టేబుల్ కాళ్లు విరిగాయి. తోటి సిబ్బంది సలీం ఖాన్ ను వనపర్తి ఆస్పత్రిలోకి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన కానిస్టేబుల్ సలీంఖాన్ శ్రీరంగాపురం పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతదేహాన్ని వనపర్తి ఎస్పీ అపూర్వారావు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.