
- ఇయ్యాల అభిమానులతో మైనంపల్లి భేటీ
హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గులాబీ పార్టీలోనే కొనసాగుతారా.. లేదా అనేది శనివారం తేలిపోనుంది. ఇటీవల తిరుమలలో హరీశ్రావుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయనకు పార్టీ హైకమాండ్ మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ఇచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా హరీశ్రావుపై ఆరోపణలు చేశారు. తాను పార్టీపై, కేసీఆర్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేసీఆర్ కూడా తన గురించి ఏమి మాట్లాడలేదన్నారు. హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఆయన శనివారం దూలపల్లిలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమవుతున్నారు.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, అన్ని సర్కిళ్ల కమిటీ మెంబర్లు మిగతా నాయకులంతా అటెండ్ కావాలని సమాచారం ఇచ్చారు. మల్కాజిగిరి టికెట్ తనకు ఖరారు చేయగా మెదక్టికెట్తన కుమారుడు రోహిత్కు ఇవ్వాలని మైనంపల్లి కోరుతున్నారు. ఇటీవల కేసీఆర్మెదక్జిల్లా పర్యటనలో అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్రెడ్డిని గెలిపించే బాధ్యత మంత్రి హరీశ్రావుకు అప్పగించారు. దీంతో రోహిత్కు టికెట్ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. మైనంపల్లి బీఆర్ఎస్లోనే కొనసాగుతారా, పార్టీని వీడుతారా అనేది తేలిపోనుంది.